Sunday, January 13, 2019

నా దేశం నా రాష్ట్రం నా ఊరు నా జాతి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా 
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా 
పొగడరా నీ తల్లి భోమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవము --- గురజాడ వారు 

కానీ ఈ రోజు గౌరవం అన్న పదము గర్వాంగా మారింది.. ఇది మన లోని అజ్ఞానానికి పరాకాష్ఠ అని అనటం లో ఏ సందేహం లేదు. అవును మన దేశం మన రాష్ట్రము మరియు ఉనికిడి గూర్చి నలుగురు గౌరవంగా చెప్పుకోవాలి అనుకోవటం తప్పు కాదు కానీ దానికోసం మనం గర్వం అలవరచు కోవటం మూర్ఖత్వం. 

ఈ మధ్య జరిగిన ఎన్నో సభలు సన్నివేశాలు ఈ తీరుకు అద్దం పడుతూ అడ్డం పడుతున్నాయి అనటం లో చాలా సిగ్గుతో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు. ఎవరు ఎందుకోసం  చేసారు అన్నది ఈ రోజు ముఖ్యమైన అంశం కాదు కానీ ఏ ఉద్దేశం తో చేశారు అన్నది మాత్రం మన జీవన విధానాన్ని ప్రశ్నించే ఒక సూటి పోటీ అయినా మాట లాగ అనిపిస్తుంది. మనకు అందరికి తెలిసిన విషయం ఏంటి అంటే రాజకీయం ఈ రోజున మన ఒక జీవన విధానంగా మారింది ఇది మారాలి. రాజకేయం మనల్ని శాసించే విధానం మారాలి. అవును మన పాలన మనమే చేసుకోవాలి కానీ మనం ఈ రోజు రాజకీయాలకు బానిస అవ్వటం ఇవాల జగుతున్న మన ఆలోచనలో ఉన్న దౌర్భాగ్యం. ఎందుకు ఈ పరిస్థితి ఎవ్వరి కోసం మనకు ఈ ఇబ్బందికర వాతావరణం. ఒక్క సారి మన పునః పరిశీలించుకుందాం. 

కుచ్చు టోపీ అన్నపదం రాజకీయం లో ఉన్న ప్రతి ఒక్కరు వాడే పదం.  ఎవ్వరు ఈ టోపీ పెట్టుకోవటానికి ఒక్క సరి కూడా ఆలోచించకుండా చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అర్హత కావలి కావాలి రాజకీయాలకు కూడా కావాలి.  ఆలా అని అర్హుడైన ప్రతి ఒక్కరికి కుచ్చు టోపీ వెయ్యకూడదు ఎవరు రాజకీయాన్ని రాజకీయ్యంగా కాకుండా ప్రజల కోసం పరిపాలన సామర్థ్యం ఉందొ వాడిని నాయకుడు అంటారు. నాయకుడికి రాజకీయానికి చాలనే తేడా ఉంది ఆ వ్యత్సాన్ని గ్రహించి నాది అన్నది వదిలెయ్యటానికి సిద్ధంగా ఉండే నాయకుడికి ఎన్నుకోవటం మంచిది.